calender_icon.png 29 June, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

29-06-2025 02:16:21 AM

దరఖాస్తుకు జూలై 10 వరకు గడువు

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాం తి): వైద్యారోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసేందుకు శనివారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండురోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ.. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకూ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. అభ్యర్థు లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందు కు జూలై 10 వరకు గడువు ఉంది.

కాగా, గడిచిన 17 నెలల్లో రాష్ట్రప్రభు త్వం 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిం ది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్‌లు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్లు, 1,931 మల్టీ పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగు తున్నది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదలయ్యా యి. యంత్రాంగం మెరిట్ జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. 

ఢిల్లీకి వివరణ ఇచ్చిన ప్రభుత్వ సీఎస్..

మెడికల్ కాలేజీల్లో సరైన సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, ఫ్యాకల్టీ కొ రత కూడా ఉందని, లోటుపాట్లపై ఢిల్లీకి వ చ్చి  సమాధానం చెప్పాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే  ఈ నెల 18న ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎం ఈ ఢిల్లీకి వెళ్లి ఎన్‌ఎంసీకి వివరణ ఇచ్చి వచ్చారు.

'త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ చర్యల్లో భాగం గానే రాష్ట్రప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పదోన్నతులు ఇచ్చే ముందు 607 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే యాల్సి ఉండటంతో సర్కార్ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసింది.

1,300 పోస్టుల భర్తీ చేయాల్సి ఉన్నా..

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖా ళీలు, పదోన్నతులు పూర్తి చేసిన తర్వాత, ప్ర భుత్వం సుమారు 1,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం మాత్రం కేవలం 607 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నది. హైదరాబాద్‌లోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లను జిల్లాలకు పంపిస్తే, తర్వాత హైదరాబాద్‌లోని ఈఎన్టీ, చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో వైద్యసేవలకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవే సమస్యలు గతేడాది వైద్యులను బదీలీ చేసినప్పుడు తలెత్తాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అలాంటి సమస్యలను ముందే పరిష్కరిస్తే వైద్యం కోసం దవాఖానలకు వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పుతాయి.