28-05-2025 12:43:18 AM
అందుబాటులో టెన్త్ హాల్ టికెట్లు
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 42,832 మంది వద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 26,286 మంది బాలురు, 16,546 మంది బాలికలున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్లను స్కూల్ ప్రధానోపాధ్యాయుల నుంచైనా, లేదా వెబ్సైట్ నుంచైనా తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.