calender_icon.png 30 May, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దూరు మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

28-05-2025 12:44:09 AM

  1. ఎస్.డి.ఎఫ్. రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన

గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశం

రాయణపేట.మే 27( విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కలెక్టర్ మంగళవారం జిల్లాలోని మద్దూరు మండలంలో విస్తృతం గా పర్యటించి ఆ మండలంలో  ఎస్. డీ. ఎఫ్ ( స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) తో కొనసాగుతున్న బీటి రోడ్డు నిర్మాణ పనులు, బ్రిడ్జి నిర్మాణ పనులు, బీటీ రెన్యువల్ నిర్మాణ ప నులను పరిశీలించారు.

ముందుగా నారాయణపేట మండలం బండ గొండ నుంచి మద్దూరు మండలం చెెన్వార్ బీటీ రోడ్డు, అ లాగే  బండ గొండ నుంచి మద్దూరు మం డలం మోమినాపూర్ బీటీ రోడ్డు పనులతో పాటు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో పనులు చేయించాల ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు.

ఆ తర్వాత మోమినాపూర్ నుంచి  గని మోనిబండ, అభంగాపూర్ ( నారాయణ పేట మండలం) లింక్ బీటీ రోడ్డు పనులు, అప్పిరెడ్డిపల్లి ( మద్దూరు) నుంచి  రెనివట్ల  రాళ్ల బావి బీటీ రోడ్డు నిర్మా ణ పనులను పరిశీలించి గడువులోపు పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. చివరగా  రెనివట్ల  నుంచి మోమినాపూర్  వరకు పూ ర్తయిన బీటీ రోడ్డు ను కలెక్టర్ పరిశీలించారు.

ఆయా రోడ్డు నిర్మాణ పనులను తొం దరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఈ. ఈ. హిర్యా నాయక్, ఏ.ఈ విలోక్ ను కలెక్టర్ ఆదేశించారు.  కొత్త బీటీ రోడ్ల పనులతో పాటు రె న్యువల్ బీటీ రోడ్ల పనులు కూడా ప్రారంభించి వెంటనే పూర్తి చేయించాలని అధికారు లకు సూచించారు. 

భూనేడు కళాశాల నిర్మాణ పనుల పరిశీలన 

కొత్తపల్లి మండలం భూనేడు జెడ్పీ ఉన్న త పాఠశాల ఆవరణ లో రూ. 6 కోట్ల వ్య యంతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నిర్మాణ పనులు ఇంకా పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాల ఆవరణలో పనులు జరుగుతున్నాయని, పాఠశాల పునః ప్రారం భం అయితే మళ్ళీ పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని, పనులను తొందరగా పూర్తి చేయించాలని అధికారులకు ఆమె సూచించారు. 

మద్దూరు గురుకుల పాఠశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి 

మద్దూరు మండల కేంద్రంలో రూ. 30 కోట్ల నిధులతో చేపట్టే సాంఘిక సంక్షేమ బా లికల గురుకుల పాఠశాల/ కళాశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మద్దూరు పర్యటనలో భాగంగా ఆ మె మండల కేంద్రానికి సమీపంలో గురుకుల పాఠశాల /కళాశాల నిర్మాణానికి గుర్తిం చిన  3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. 

నిర్మాణ పనులు ఇంకా ఎందుకు ప్రా రంభం కాలేదని అధికారులను ప్రశ్నించారు. స్పందించిన అధికారులు ముందుగా  అనుకున్న ప్లాన్ కంటే కొంచెం మార్పు చేయడం జరిగిందని, ఆ స్థలంలో  వెనక పైపు ఉన్న  ఓ ప్రార్థన మందిరాన్ని ముందు వైపు నిర్మించడం జరుగుతుందని, అలాగే సాయిల్ ( నేల) పరీక్ష చేయిస్తున్నామని, రెండు రోజులుగా వర్షం కురుస్తున్నందున పనులు ఇం కా ప్రారంభించలేదని నిర్మాణ పనులు పొందిన కంపెనీ నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు.

ఇసుక కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా రవాణా లో కొంత జా ప్యం జరుగుతోందని కంపెనీ నిర్వాకుడు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాడు. స్పందించిన కలెక్టర్ స్థానిక తహసిల్దార్ తో  మాట్లాడి ఇసుక రవాణా కు ఆటంకం లేకుండా చూ డాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మద్దూరు తహాసి ల్దార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కొనసాగుతున్న భూ భారతి దరఖాస్తుల వెరిఫికేషన్ ను పర్యవేక్షించారు.