16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వ్యవసాయ మెలకువల ప్రదర్శన

02-03-2026 12:00 AM

అశ్వారావుపేట, మార్చి 1 (విజయక్రాంతి) : వ్యవసాయంలో వ్యవహరించాల్సిన మెలుకువులను  వ్యవసాయ కళాశాల  అసోసియట్  డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ రైతులకు తెలియజే శారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగో రోజులో భాగంగా  ఆదివారం రైతులకు నేలలో తేమ శాతాన్ని కొలిచే విధానాన్ని పద్ధతి ప్రదర్శన చేసి చూపించారు. అలాగే పంటలలో నీటిపారుదలని విధానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు గ్రామంలోని సూర్యమండల మోడల్ ని సందర్శించారు.

దీనిలో కూరగాయలు, దుంపలు మరియు పండ్ల సాగు చేసే విధానాన్ని పరిశీలించారు. రైతులను అడిగి తమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు. తదుపరి పంటలకి పంచగవ్య,  ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని గురించి తెలుసుకున్నారు. పంటలలో క్రిమిసంహారక మందులని  పిచికారి చేసే విధానాన్ని రైతులకు వివరించారు.

వయ్యారి భామ కలుపు నిర్మూలించి మరియు ఆ మొక్క వలన కలిగే హానికరమైన ప్రభావాలని రైతులకి వివరించారు. అనంతరం వారు పొగాకు రైతులతో కలిసి క్యూరింగ్ విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ గారి నేతృత్వంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డా. శ్రీజన్ మరియు డా.ఝాన్సీ రాణి లు నిర్వహించారు.