30-05-2025 06:27:19 PM
నిర్మల్(విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న కూలీలకు కూలి రేట్లు 600 నుంచి 1200 కు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, నరసయ్య తదితరులు మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో వస్తున్న సమస్యలను పరిష్కరించాలని, రోజుకూలి రూ.600 చెల్లించాలని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని పేర్కొన్నారు.
ఉపాధి హామీ కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ ల ఇతర సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కూలీలకు గడ్డపార, తట్ట, పారా పనిముట్లు కొనుగోలు చేసి ఇవ్వాలి. ఉపాధి బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని, ఉదయము సాయంత్రం రెండు ఫోటోలు తీసి పంపాలనే నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది.