30-05-2025 06:20:46 PM
వలిగొండ,(విజయక్రాంతి): సంఘటిత అసంఘటిత కార్మికులకు అండ సిఐటియు జెండా అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్(CITU District Assistant Secretary Turkapalli Surender) అన్నారు. సీఐటీయూ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ... 1970లో ఏర్పడిన ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఏర్పడ్డ నాటి నుండి నిరంతరం కార్మికులకు కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన నిలబడడం జరుగుతుందని అన్నారు. కార్మికుల పోరాడి సాధించుకున్న చట్టాలను అధికారంలో ఉన్న పాలకవర్గాలు చట్టాలను మారుస్తూ కార్మికుల శ్రమ ను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు చేసే పోరాటాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు మల్లేశం, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ మండల నాయకులు కొండ నరసింహ, ఉక్కుర్తి రాములు, ఎడవల్లి ఎల్లమయ్య, హమాలి కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జన్ని జంగయ్య, గాడి పెళ్లి నరసింహ, వీరస్వామి, ఎల్లయ్య, తాళ్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.