16-06-2025 10:29:58 PM
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం..
మునుగోడు (విజయక్రాంతి): వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకొని శాస్త్రీయ విధానంలో రైతులు వ్యవసాయం సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయని శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం(Legislative Council Members Nellikanti Satyam) అన్నారు. సోమవారం రైతు నేస్తం కార్యక్రమం మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా తక్షణమే రైతుల అకౌంటర్లో జమ చేయాలని అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి రైతు పండించే పంట అధిక దిగుబడులు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని పద్మజ , కొంపెల్లి ఏఈఓ యాదగిరి, వహీద్, రైతులు లాలయ, కోటేశ్వరరావు, ఆల్ల రాజు వీరమల్ల యాదయ్య, వీరమల్ల వెంకట్ రాములు, ఎడ్ల రామలింగయ్య, శ్యామల, సుజాత, లక్ష్మి, వెంకటమ్మ, సురిగి చలపతి, గురుజా రామచంద్ర, చాపల శ్రీనివాసులు, కైలాస్, శంకర్, పాండు, శ్రీశైలం ఉన్నారు.