calender_icon.png 17 June, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో ఆరు పశువులు మృతి

16-06-2025 10:26:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సీరోలు మండలం తాళ్ల సంకీస శివారు పొలాల్లో తెగిపడ్డ విద్యుత్తు లైనుకు విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతంతో ఐదు ఆవులు, ఒక ఎద్దు మృత్యువాత పడ్డాయి. మరో ఎద్దు తీవ్రంగా గాయ పడింది. పిక్లా తండాకు చెందిన రైతులకు చెందినవిగా గుర్తించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కురవి మహబూబాబాద్ రహదారిపై నిరసనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న సీరోల్ ఎస్సై నగేష్ సంఘటన స్థలికి చేరుకొని ఆందోళనకారులకు ట్రాఫిక్ క్లియర్ చేశారు. విద్యుత్తు లైను తెగిపడ్డా విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యుత్ సరఫరా జరిగి పశువులు మరణించాయని, విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.