30-05-2025 03:15:23 AM
ఎమ్మెల్యే మధసూదన్రెడ్డి
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయితీ నడుస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అడ్డగోలుగా సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం పోయాక.. వారి మధ్య వాటాల పంచాయితీ వచ్చిందని అభిప్రాయపడ్డారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని రుజువైందన్నారు. లోక్సభ ఎన్నికల్లోనే ఆ రెండు పార్టీలు కలిశాయని, ఎమ్మెల్సీ కవిత కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదన్నారు. హబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కేవలం అధికారం కోసమే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమకారుల గొంతు కోసిన పాపంలో కవితకు భాగం ఉందన్నారు. ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలతో కవిత ఆడుకున్నారని విమర్శించారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటే నాశనం అవుతుందనే, ప్రజలు కాంగ్రెస్కు పట్టంగట్టారన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.