10-10-2025 11:15:28 PM
మందమర్రి జీఎంకు ఎఐటీయూసీ వినతి
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ వెనకాల గల సౌత్ కాస్కట్ గని కబ్జాపై చర్యలు తీసుకోవాలని ఏఐటీ యూసీ గుర్తింపు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బొగ్గు గని భకబ్జా పై మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ కలసి వినతి పత్రం అందజేశారు. భూమి కబ్జా కాకుండా చూడవలసిందిగా కోరారు. కబ్జా భూమిని సింగరేణి స్వాధీనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతూ మెమొరండం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ... బెల్లంపల్లి పట్టణంలో 1928 సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణంలో అనేక బొగ్గు గనులతో కార్మిక బస్తీలతో నిండు పున్నమి చంద్రునిలా పట్టణం వికసించేదనీతెలిపారు. సింగరేణి కంపెనీకి 80 సంవత్సరాలుగా సిరులు అందించిన పట్టణంలో బజార్ ఏరియా కు సౌత్ కలాస్కట్ బొగ్గు గని నడిచిందన్నారు. ఈ గని కి అనుకొని క్యాంటీన్, ఎస్ఎంపిసి ఆఫీస్, కోల్ శాంపిల్ ఆఫీస్, సివిల్ డిపార్ట్మెంట్, లాంప్ క్యాబిన్ కార్యాలయం కూడా ఉండేవనీ వివరించారు.
కన్యకా పరమేశ్వరి దేవాలయం, పద్మశాలి ఫంక్షన్ హాల్ స్థలంలో సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసే ఆఫీసు, సిమెంట్ పోల్స్ సిమెంట్ ఇటుకలు ఈ స్థలంలో తయారు చేసేవారనీ పేర్కొన్నారు, సింగరేణి అధికారులు గతంలో పనిచేసిన వారు ఇట్టి స్థలాన్ని రెండు దేవాలయాలకు ఇవ్వడం జరిగిందన్నారు. పద్మశాలి భవన్లో ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఇచ్చిన స్థలం కాంపౌండ్ వాల్ లోపల ఇంకా ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కాంపౌండ్ వాల్ అవతల దేవుని విగ్రహాల పేరట పూజలతో ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసంగాలేదన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం, సింగరేణి అధికారులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, ఎమ్మెల్యేపై వాస్తవాలను అర్థం చేసుకొని అట్టి స్థలాన్ని ఖాళీ చేయించడానికి సింగరేణి యాజమాన్యానికి సహకరించాలనీ కోరారు.
కబ్జాదారులను ప్రోత్సహించడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. సీఎండి బలరాం వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామనీ విజ్ఞప్తి చేశారు. మూసివేసిన ఎక్స్ప్లోరేషన్ డివిజన్ ఆఫీసు, ఏజెంట్ ఆఫీసు, వర్క్ షాప్, పవరోజ్ ఓల్డ్ సిఎస్పి, మమ్మద్ హుస్సేన్ షెడ్ టింబర్ యాడ్, ఓల్డ్ జిఎం ఆఫీస్, టింబర్ డిపార్ట్మెంట్ ఆఫీసల భూములను కాపాడాలని జయం రాధాకృష్ణన్ కు విజ్ఞప్తి చేశారు. యజమాన్యo సింగరేణి స్థలాలను కబ్జాకోరుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.పద్మశాలి భవన్ ముందు నిర్మించిన అక్రమ కట్టడాలను నిలిపి వేయా లన్నారు.