6 May, 2026 | 11:08 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఏసీబీ వలలో అలంపూర్ ఇరిగేషన్ శాఖ డీఈ

08-08-2025 01:55 AM

రూ.11 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం

అలంపూర్, ఆగస్టు, 07: అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు.వివరాల్లో కి వెళ్తే...అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ మెజర్మెంట్ రికార్డు చేసే విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ నుండి డీఈ శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు.సుమారు నాలుగు లక్షలకు సంబంధించిన పని కోసం మూడు శాతం కమీషన్ కావాలని డిమాండ్ చేశారు.

అందులో భాగంగా రూ.11 వేల రూపాయలు ఇవ్వాలని కోరగా.. అందుకు ఇష్టపడని ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తుండగా డీఎస్పీ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి తెలిపారు.కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎండీ ఖాదర్ జిలానీ ,సిబ్బంది పాల్గొన్నారు.