6 May, 2026 | 10:20 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కమిషన్ల కోసమే చెక్ డ్యాం కట్టిండ్రు

08-08-2025 01:56 AM
  1. 2019లో కడితే ఇప్పుడే కూలింది 

ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరమ్మతు చేపిస్తాం 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల ఆగస్టు 7 : గత ప్రభుత్వం కమిషన్ల కోసమే చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టిందని నాసిరకంగా నిర్మించి వారికి రావలసిన నిధులను రాబట్టుకోవడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శించారు. మిడ్జిల్ మండలం మిషన్ కాకతీయ ఫేస్ - 4 లో భాగంగా వాస్పూల కత్వను పునరుద్ధరించుటకు 2019 ఏడాదిలో రూ 136.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం కొంత భాగం కూలిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

నాణ్యత లోపిస్తే నిర్మాణాలు ఇలానే ఉంటాయని, ప్రతినిర్మాణం నాణ్యతగా చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి మరమ్మత్తులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని జరిగిన కాంట్రాక్టర్లు బాధ్యతగా నాణ్యతగా చేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే ఎంతటి వారిపైన అయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.