calender_icon.png 27 June, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు

27-06-2025 01:56:25 AM

 కొత్తపల్లి, జూన్ 26 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా లోని అంతర్గాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించిన అంతర్ జిల్లా బాలుర ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి కె. రిషిరెడ్డి, జి. హేమంత్ జాదవ్ సబ్-జూనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి త్వరలో నిజామాబాద్లో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనతో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.

సందర్భంగా విజేతలకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. రాష్ట్ర స్థాయిలోను అఖండ విజయాలను నమోదు చేసి జాతీయ స్థాయిలోను ప్రతిభ చాటి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.