వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
18-04-2026 08:37 PM
దేవరకొండ,(విజయక్రాంతి): వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. అని ఆర్డిఓ రమణారెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ మండలములోని ముదిగొండ గ్రామములోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు ఎండకాలం చాలా జాగ్రత్త పొలం పనులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎ.వో గ్రామ సర్పంచ్ రైతులు. తదితరులు పాల్గొన్నారు.






