6 June, 2026 | 6:49 PM

Breaking News

వైద్యులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి   •   గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •  

బీసీల రిజర్వేషన్లకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలి

29-03-2026 12:00 AM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, బీసీల రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు.

కాలుష్య నివారణకు నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు బాగా పెరగాలని, అయితే వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందన్నారు. కానిస్టేబుళ్లకు రావాల్సిన టిఏ, డీఏలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి అంశానికి హౌస్ కమిటీ అనేది పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు.