16 April, 2026 | 6:08 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

02-06-2025 02:00 AM

మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని గీతాంజలి హై స్కూల్ లో 2006 2007 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 18 సంవత్సరాల క్రితం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు.

చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు యాదగిరి, మహేందర్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్, బాలరాజు, సంతోష్, రవి కళ్యాణ్, పుష్ప, నిర్మల, కళావతి లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హరీష్, సాగర్, రోమన్, శ్రావ్య, సంతోషి, లక్ష్మి, శిరీష, నరేష్, నివిల్, దిలీప్, అనిల్, శ్రీకాంత్, వీరన్న, హసీనా, స్వాతి పాల్గొన్నారు.