calender_icon.png 3 June, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

02-06-2025 02:00:52 AM

మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని గీతాంజలి హై స్కూల్ లో 2006 2007 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 18 సంవత్సరాల క్రితం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు.

చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు యాదగిరి, మహేందర్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్, బాలరాజు, సంతోష్, రవి కళ్యాణ్, పుష్ప, నిర్మల, కళావతి లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హరీష్, సాగర్, రోమన్, శ్రావ్య, సంతోషి, లక్ష్మి, శిరీష, నరేష్, నివిల్, దిలీప్, అనిల్, శ్రీకాంత్, వీరన్న, హసీనా, స్వాతి పాల్గొన్నారు.