03-08-2025 08:26:40 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కొత్తపల్లి (హవేలీ)లో 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మన బాల్యం – మధుర స్మృతులు అనే భావనతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను నర్సింగరావు వరప్రసాద్ భూమేష్ జగదీశ్వర్ బ్రహ్మానందం అనంత చారి ఉమారాలి ప్రమోద ఉపాధ్యాయు లను ఘనంగా సత్కరించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మళ్లీ అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పాల్గొన్న విద్యార్థులు పేర్కొన్నారు.