26 May, 2026 | 4:14 PM

Breaking News

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •   పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నండి: మండల వ్యవసాయ అధికారి   •   అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం   •   యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స విజయవంతం   •  

ప్రపంచానికి దిక్సూచి అంబేద్కర్‌

06-12-2025 09:36 PM

తుర్కయంజాల్‌: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనలు ప్రపంచానికే దిక్సూచిగా నిలిచాయని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీ కాబ్‌ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. అంబేద్కర్‌ 69వ వర్ధంతి సందర్భంగా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్‌ అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు చెక్క బాల నర్సింహ, జనరల్‌ సెక్రటరీ గుడ్ల శ్రీనివాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఖానాపురం దాసు, బీజేపీ రాష్ట్ర నాయకులు బచ్చిగళ్ల రమేష్‌, మాజీ వార్డు సభ్యుడు గుండా బాలరాజు, మైనార్టీ నాయకులు ఫైసల్‌, నాయకులు కొత్తకుర్మ శ్రీశైలం, మేతరి శంకర్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.