18-07-2025 02:11:57 PM
ఇల్లందు, (విజయక్రాంతి): రైస్ మిల్లు(Rice Mill Owners) యాజమాన్యాలతో ఏఎంసీ చైర్మన్ బానోతు రాంబాబు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులకు ట్రేడింగ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్సులు తప్పనిసరిగా మార్కెట్ నుండి పునరుద్ధరించుకోవాలని సూచించారు. అదేవిధంగా మార్కెట్ కమిటీకి ఆదాయం చేకూర్చే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సుచిత్ర, సూపర్వైజర్ శ్రీనివాస్, రైస్ మిల్లర్ల యాజమాన్యాలు పాల్గొన్నారు.