11-06-2025 07:09:52 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి(Bellampalli) పట్టణం హనుమాన్ బస్తీ 33వ వార్డు అంగన్వాడి కేంద్రంలో స్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు అంగన్వాడీలో చేర్పించాలని ఫ్రీ స్కూల్ మెటీరియల్ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో బస్తీ వీధులలో పిల్లలు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి పిల్లలకు ఎగ్ బిర్యానీతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వరూప, సూపర్వైజర్ ప్రసన్న, అంగన్వాడి టీచర్లు పద్మావతి, రాజేశ్వరి, ఆయాలు భాగ్య, సునీత, మునెమ్మ, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.