11-06-2025 07:12:12 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పిల్లలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ పిల్లలను చేర్పించాలని కోరుతూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారి రాజేంద్రప్రసాద్(Officer Rajendra Prasad) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాజాత ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. మేరుగు రవీందర్ ఆధ్వర్యంలో సత్యనారాయణ, దర్శనం యుగంధర్, యాదయ్య, ఐలేష్ కుమార్, పరమేష్, నరేష్ కీర్తి, రాజ్యలక్ష్మి, రోజా తదితరులు గ్రామాల్లో కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.