calender_icon.png 13 June, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

11-06-2025 07:01:39 PM

కోదాడ: జడ్పీ బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు పట్టణంలో 6వ రోజు బడి బాట ప్రచారం బొడ్రాయి బజారు, కూరగాయల మార్కెట్ బజారు నందు నిర్వహించారు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఉచితంగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం వారానికి మూడు గుడ్లు రాగి జావ అందించడంతో పాటు, మెడికల్ చెకప్, చదువుతో పాటు సంస్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కంప్యూటర్, సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఎఐ కృత్రిమ మేధా అనుసంధానంతో బోధన జరుగుతున్నదని తెలిపారు.

10వ తరగతి ఫలితాలలో 571 మార్కులతో తాళ్లూరి రేఖ శ్రీ జిల్లా టాపర్ గా ప్రతిభ కనబరిచి, 500 మార్కులు పైగా 7 గురు విద్యార్థులు సాధించినట్లు, ఎన్ ఎం ఎం ఎం ఎస్ మెరిట్ స్కాలర్షిప్ లు 3 గురు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ఇ. శ్రీనివాస్ రెడ్డి, డి. లింగయ్య, కె. రామకృష్ణ, ఎం .వీరబ్రహ్మచారి,ఎస్. బ్రహ్మానందం, ఎం. జానకి రామ్, కె .రవి పాల్గొన్నారు