13-06-2025 06:32:06 PM
చదువుతో జ్ఞానం పెరుగుతుంది
మండల ప్రత్యేకాధికారి జ్యోతి
కామారెడ్డి,(విజయక్రాంతి): వయసుతో సంబంధం లేకుండా చదువును నేర్చుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని మండల ప్రత్యేకాధికారి జ్యోతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా వయోజన విద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... చదవడం రాయడం రాని 15 సంవత్సరాలు దాటిన వయోజనులకు చదవడం రాయడం నేర్పాలని అన్నారు . గ్రామంలో 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాసులను ఉల్లాస్ యాప్ ముందు నమోదు చేసి పదిమందికి ఒక వాలంటరీ నియమించి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MPDO ప్రవీణ్ కుమార్, ఏం ఈ ఓ విజయ్ కుమార్, ఏ పి ఏం రాజు, గ్రామ సంఘం అధ్యక్షులు, వయోజనులు, సీ సీ, వి ఓ ఏ లు పాల్గొనడం జరిగినది.