13-06-2025 06:37:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎంబడి రాజేశ్వర్ ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి డా.ఈసవేని మనోజ్ యాదవ్, బీసీ నాయకులు పిండి శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం శాలువా పూల మొక్కలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంబడి రాజేశ్వర్ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నారాయణరావు పటేల్, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎంబడి రాజేశ్వర్ నిరాడంబరుడని అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలవారని పేర్కొన్నారు.