10 May, 2026 | 7:00 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ విజయం

26-01-2025 11:37 PM

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (177) భారీ సెంచరీతో మెరిశాడు. 9 వికెట్లతో హిమాచల్ నడ్డి విరిచిన అనికేత్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 439 పరుగులతో, మేఘాలయపై ఒడిశా ఇన్నింగ్స్ 56 పరుగులతో, బీహార్‌పై యూపీ ఇన్నింగ్స్ 119 పరుగులతో, చత్తీస్‌గఢ్‌పై జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో, చంఢీగర్‌పై తమిళనాడు 209 పరుగుల తేడాతో, రాజస్థాన్‌పై విదర్భ 221 పరుగుల తేడాతో విజయాలు నమోదు చేసుకున్నాయి. సర్వీసెస్ x త్రిపుర, రైల్వేస్ x అస్సాం, ఎంపీ x కేరళ, ఆంధ్ర x పాండిచ్చేరి మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తర్వాతి రౌండ్ మ్యాచ్‌లు జనవరి 30 నుంచి జరగనున్నాయి.