15 June, 2026 | 10:18 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను విస్తృతపరచాలి: -ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

09-04-2026 12:57 AM

మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్ వాడీ కేంద్రాల సేవలను లబ్ధిదారులకు మెరుగైన, నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించేందుకు విస్తృతపరచాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్‌అర్ ) అన్నారు. బుధవారం మిర్యాలగూడ అర్బన్ సిడిపిఓ రేఖల మమత ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని 194 మంది అంగన్ వాడీ టీచర్లకు ఎన్ హెచ్ టి ఎస్, పోషణ ట్రాకర్ యాప్ లను పొందుపర్చేందుకు సెల్ ఫోన్ లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పేదలకు అందజేసేందుకు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా నూతన సాంకేతికతో అంగన్ వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకందిస్తున్న సేవలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంబంధించిన ప్రతి డాటా ను ఈ యాప్ లో పొందుపరచాలన్నారు.

అనంతరం 251 అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు రాధిక, నాగమణి, నజీమా బేగం మహమ్మద్, వాణి,హేమాదేవి,పద్మ, నిహారికలతో పాటు అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.