03-06-2025 11:02:23 PM
CITU డిమాండ్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వం అంగనవాడి టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో విడుదలకు ముందు రిటైర్ అయిన అంగన్వాడి టీచర్లకు రూ 2 లక్షలు, ఆయాలకు రూ లక్ష అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి(CITU District Vice President Dodda Ravi) డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద జరిగిన అంగన్వాడీ ప్రాజెక్టు మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2023 అక్టోబర్ లో 24 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ అమలులో భాగంగా రిటైర్ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష GO విడుదల చేశారని గుర్తు చేశారు.
వారి పెన్షన్ల గురించిన ప్రస్తావన లేదని అదేవిదంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుమారు 4వేల మంది రిటైర్ అయ్యారని వారికి కూడా ప్రస్తుత జీవో ప్రకారం బెనిఫిట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు .మినీ సెంటర్ వాళ్లకు పెండింగులో ఉన్న వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ ఆయాలను నియమించాలని డిమాండ్ చేసారు. ప్రతి అంగన్వాడీ కి రిటైర్ అయ్యేనాటికి వచ్చే వారి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని వారిని ప్రభుత్వ 3, 4 తరగతి ఉద్యోగుల గా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
నెల నెలా ఇంటి కిరాయిలు ఇవ్వాలని ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అలా కాని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ వైఖరి పట్ల 10 జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర సంఘాల ఆద్వర్యంలో జులై 9 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CITU పట్టణ కన్వీనర్ సత్య అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు రాజ్య లక్ష్మీ, రమ్య, అచ్చమ్మ, రోజా, లక్ష్మీ, చుక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.