కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మించాలి
శ్రీశైలం 67 గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయాలి
చిన్నంబావి, జూలై 19: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రౌన్ గార్డ్ ఫంక్షన్ హాల్ లో సాగు నీటి సమస్యలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొల్లాపూర్ నియోజక వర్గం జేఏసీ తరుపున పెరుమాళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ నది సుమారు 200 కిలోమీటర్ల ప్రవహిస్తూ నేపథ్యం లో కొల్లాపూర్, అలంపూర్,గద్వాల, వనపర్తి జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు నిర్వసితులుగా మారారని వారందరికీ న్యాయం చేయాలన్నారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ,జూరాల, భీమా చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి వీపనగండ్ల మండలంలో సుమారు 45 వేల ఎకరాలకు నీళ్ళు అందించడానికి కృష్ణ నదిపై మరో లిఫ్టు లేదా బ్యారేజ్ నిర్మాణం చేస్తే చివరి ఆయకట్టు ప్రాంతాలకు పుష్కలంగా సాగు,త్రాగు నీరు అందించవచ్చని తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివిధ పార్టీల జిల్లా అధ్యక్షులు, పలు నియోజకవర్గాల జేఏసీ ఇన్చార్జీలు,రాఘవాచారి,ప్రకాశ్ గౌడ్, తిమ్మప్ప, వెంకటేశ్వర్లు, కొల్లాపూర్ తరుపున తెలంగాణ ఉద్యమకారులు దేశగౌని రామన్ గౌడ్,పెరుమాళ్ళ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.*






