15-06-2025 01:30:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 14 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అసభ్యకర, పరుష వ్యాఖ్య లు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
గురువారం బల్మూరి వెంకట్ సైబర్క్రైమ్ పోలీసులకు అందించిన లిఖితపూర్వక ఫిర్యాదులో, కేటీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గౌరవ, ప్రతిష్టలను దెబ్బతీసేలా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలు రాష్ర్టంలో శాంతిభద్రతలను అస్థిరపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని, వీటిని అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, కేటీఆర్కు నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాధ్యతాయుత పౌరుడిగా, రాష్ర్ట సమగ్రతను కాపాడేందుకు ఈ ఫిర్యాదు చేశాను అని బల్మూరి అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.