7 July, 2026 | 6:25 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ఏఐజీ ఆస్పత్రికి మరోసారి కేసీఆర్

15-06-2025 01:30 AM
  1. వైద్యుల సూచన మేరకు రెండోసారి..
  2. కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్న మాజీ సీఎం

శేరిలింగంపల్లి, జూన్ 14: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి శనివారం మరోసారి వెళ్లారు. గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్న కేసీఆర్.. ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సంతోష్ ఉన్నారు.

శుక్రవారమే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న గులాబీ బాస్ మరోసారి వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నందీనగర్‌లోని నివాసానికి వెళ్లారు. ఐదు రోజుల పాటు నందీనగర్‌లోనే ఉండనున్నా రు. కాగా ప్రతీ రెండు నెలలకు ఒకసారి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు.

గతంలో యశోదా ఆస్పత్రికి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు. ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గడిచిన ఏడా దిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు. అందుబాటులో ఉండా లని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్‌లోనే ఉండనున్నారు.