02-02-2026 02:28:01 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్రబడ్జెట్ 2026---27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయమని తెలిపారు. కేంద్ర బడ్జెట్పై ఆదివా రం ట్విట్టర్ వేదికగా హరీశ్రావు స్పందించారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని వెల్లడించారు.
తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది అని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, బడ్జెట్ లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా, వాటి ఫలితం మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. .