15 March, 2026 | 8:01 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రుణమాఫీ పేరిట మరో మోసం

19-07-2024 12:34 AM

లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన కాంగ్రెస్ ప్రభుత్వం

రైతుబంధు నిధుల దారి మళ్లింపు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మరోసారి మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్‌లో ఇవ్వాల్సిన నిధుల నుంచి రూ.7 వేల కో ట్లు దారి మళ్లింపు చేయడం సరికాదన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి సర్కా ర్ ఫోజులు కొడుతుందని మండిపడ్డారు. 40 లక్షలకుపైగా రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఏవిధంగా ఎంపిక చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేసిన దాని తో పోలిస్తే పావు వంతు మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. 2018లో రూ.లక్షలోపు రుణమాఫీకీ రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం  లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షల వరకు ఉందన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతుబంధు విడుదల చేయాలన్నారు.