21 March, 2026 | 2:15 AM

పశ్చిమాసియాలో మరో భారతీయుడి మృతి

21-03-2026 12:34 AM

రియాద్, మార్చి 20: అమెరికా-ఇజ్రాయెల్, ఇరా న్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్లో మరో భారతీయుడు మృతిచెందాడు. ఈ నెల 18న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన దాడిలో ఆయన మరణించాడు. దీంతో గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న దాడుల వల్ల మృతి చెందిన భారతీయుల సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరింది. ఈ ఘటనపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం సం తాపం తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారుల సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొంది.