13 July, 2026 | 11:56 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

13-07-2026 09:04 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా 16వ మహాసభలను స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ అధ్యక్షతన జరిగింది. మహాసభల ప్రతీకగా ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మాజీ ఉమ్మడిరాష్ట్ర ఉపాధ్యక్షులు పైడిపల్లి రాజు ఎగురవేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, కాంట్రాక్టీకరణ–ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తూ శాశ్వత ఉద్యోగ అవకాశాలను కుదిస్తోందన్నారు.

నాలుగు లేబర్ కోడ్స్, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, నియామకాలలో జాప్యం, విద్యా–వైద్య రంగాల వాణిజ్యీకరణ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా విద్యా, రాజకీయ చైతన్యానికి కేంద్రంగా ఉన్నప్పటికీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత, గ్రంథాలయాల అభివృద్ధి లోపం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కొరత, క్రీడా సదుపాయాల లోపం, నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.

జిల్లా పరిశ్రమల్లో స్థానిక యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, జిల్లా కేంద్రంలో ఆధునిక యువజన అభివృద్ధి కేంద్రం, స్టడీ సర్కిల్, కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు. సెప్టెంబర్ 8, 9, 10వ తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువజన సమస్యల పరిష్కారానికి, విద్య–ఉపాధి హక్కుల సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, ప్రజాస్వామ్య–లౌకిక భారత నిర్మాణానికి కొత్త కార్యాచరణను రూపొందించనున్నాయన్నారు. అదే విధంగా మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ  ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువజన సంక్షేమానికి ప్రత్యేకమైన సమగ్ర విధానం అమలు చేయలేకపోయిందన్నారు.