20-04-2025 10:10:57 PM
కల్లూరు (విజయక్రాంతి): మండల టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ సెంటర్లో చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకొని టిడిపి నాయకులు జాస్తి శ్రీనివాసరావు, పోట్రు శ్రీనివాసరావులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్టా గోపాలరావు, మద్దినేని రాధాకృష్ణ, మీసాల కృష్ణ, మండే పూడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.