18 April, 2026 | 10:57 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

అమెరికాలో ఏపీ డాక్టర్ కాల్చివేత

26-08-2024 04:54 AM

మృతుడు ప్రముఖ ఫిజీషియన్ రమేశ్ పెరంషెట్టి

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచ గుర్తింపు పొందిన వైద్యుడు డాక్టర్ పెరంషెట్టి రమేశ్‌బాబు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన రమేశ్.. అమెరికాలో అనేక దవాఖానలకు యజమాని. అలబామాలోని టస్కలూసా పట్టణంలో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ప్రాంతంలో ఎంతో ప్రజాదరణ పొందిన క్రిమ్సన్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రమేశ్ సహ వ్యవస్థాపకుడు. 

ఎంతో గొప్ప పేరు

టస్కలూసా కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న రమేశ్‌కు ఈ రంగంలో 38 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ప్రఖ్యాత ఫిజీషియన్‌గా ఎదిగారు. ఆయన సేవలకు గుర్తుగా టస్కలూసాలోని ఓ వీధికి రమేశ్ పేరు పెట్టారు. కొవిడ్ సమయంలో ఆయన అందించిన వైద్య సేవలకు గుర్తిస్తూ స్థానిక ప్రభుత్వంఅవార్డు ఇచ్చాయి.