12-06-2025 08:48:02 PM
మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నత స్థాయికి ఎదగాలని దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి(Municipal BJP President Peesari Krishna Reddy) అన్నారు. పాఠశాలలు గురువారం నుండి పునఃప్రారంభం అయిన సందర్భంగా భౌరంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధుల,నాయకుల సహకారాలతో పాఠశాలకు పుస్తకాలు, యూనిఫామ్,మధ్యాహ్న భోజనం సమకూర్చామని, ఇంకా ఏమైనా వసతులు సరిగ్గా లేకపోతే తన దృష్టికి తీసుకురండని ఉపాధ్యాయులకు తెలియజేశారు. విద్యార్థులు ఈ పాఠశాలకు, దేశానికి ఎంతో గొప్ప పేరు తీసుకురావాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం అంగన్వాడి బాలలతో కలిసి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి, శ్రీధర్, క్రాంతి, శ్రావణి, శిల్ప, జలేశ్వర్, అంగన్వాడీ టీచర్ డి. లలితా భాయి తదితరులు పాల్గొన్నారు.