13-06-2025 12:22:18 AM
ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి.
సదాశివనగర్, జూన్ 12(విజయక్రాంతి):మండలంలోని మర్కల్ గ్రామ స్టేజి వద్ద గల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి గురువారం ప్రకటనలో తెలియజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను బి.ఏ, బి.కాం,బి.ఎస్సీ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో(ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాల కోసం అర్హత కలిగిన ఎస్. సి.మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం మహిళా అభ్యర్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల ద్వారా నిర్వహింపబడిన ఇంటర్మీడియట్(10+2) పరీక్ష 2025లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.కళాశాలలో బిఏ లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బి. కాంలో కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ ఎనలిటిక్స్, బి.ఎస్సీలో ఎం.పి.సి, ఎం.పి.సి.ఎస్, ఎం.ఎస్.డి.ఎస్, ఎం.బి.జె డ్.సి, బి. జెడ్.సి కోర్సులు అందుబాటులో ఉన్నాయని కాగా ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం కింద ఉపాధి అవకాశాలు గల కోర్సులను సైతం ఎంపిక చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తునకు పదవ తరగతి మార్కుల మెమో (అటెస్టెడ్), ఇంటర్మీడియెట్ మార్కుల మెమో (అటెస్టెడ్), అదేవిధంగా జనవరి 1,2025 తర్వాత తహసీల్దార్చే పొందిన ఆదాయ, కుల ధ్రువీకరణపత్రంలు, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచి 23 జూన్ 2025 సాయంత్రం 4 గంటల లోగా కళాశాలలో అందజేయాలన్నారు.
అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను అనుసరించి ఇవ్వబడుతాయన్నారు. కాగా ఎస్ సి. కేటగిరి కి సంబంధించిన ఏబై శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కావున ఎస్. సి. మహిళా విద్యార్థులు డిగ్రీ లో మొదటి సంవత్సరం లో ప్రవేశం పొందడం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని, రిజిస్ట్రేషన్ ఐ. డి. తో పాటు సంబంధిత ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని 13-06-2025 తేదీ నుండి 22-06-2025 వరకు కళాశాల కు వచ్చి అడ్మిషన్ పొందవల్సిందిగా కోరడమైనది.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని అడ్మిషన్ పొందిన విద్యార్థికి ఉచిత పౌష్టికాహారం, వసతి, పుస్తకాలు, స్టేషనరీ, దుస్తులు సొసైటీ సమకూరుస్తుందని, డిగ్రీ అనంతరం ప్లేస్మెంట్ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.