13-06-2025 12:16:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): డ్రగ్స్ రవాణాను అడ్డుకునేం దుకు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ యాంటీ నా ర్కోటిక్స్ బ్యూరో గురువారం బంజారాహిల్స్లోని టీజీఐసీసీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణతో పాటు ఏపీ, గోవా, తమిళనా డు, కర్ణాటక, మహారాష్ర్ట, కేరళ ఏడు రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్యాల నియంత్రణ ఏజెన్సీలు, కేంద్ర ఏజెన్సీల అధికారులతో సమావేశం నిర్వహించింది.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. డ్రగ్స్పై తెలంగాణ రాష్ర్టం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని, ఈ మహమ్మారిని అరికట్టడానికి అధికారు లు పరస్పరం సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో నిఘా సమాచార మార్పిడిని సులభతరం చేయడం, అంతర్-ఏజెన్సీ సమన్వయాన్ని మెరుగుపరచడం, సంయుక్త కార్యకలాపాలను అన్వేషించడం, అలాగే ఆధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా డ్రగ్స్కు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు.
స్మగ్లర్లు, సమాచారాన్ని పంచుకోవడం, డ్రగ్స్ రవాణాలో కీలకమైన వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను గుర్తించడం లో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం చేయాలని పేర్కొన్నారు. డైరెక్టర్ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ.. అంతర్-రాష్ర్ట సంబంధిత కేసులు, ఆపరేషన్లను నిర్వహించేటప్పుడు సమాచారాన్ని పంచుకోవా లని అధికారులను కోరారు.
డీఐజీ అభిషేక్ మొహంతి, ఎస్పీ సి.రూ పేష్ తెలంగాణలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సమావేశంలో గోవా డీఐజీ వర్ష శర్మ, కేరళ డీఐజీ పీ విమలాదిత్య, మహారాష్ర్ట డీఐజీ శారదారౌత్, ఏపీ డీఐజీ కే నాగేశ్బాబు, తమిళనాడు మెయిలావగనన్, కర్ణాటక డీఎస్పీ శివకుమార్ పాల్గొన్నారు.