calender_icon.png 14 June, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

13-06-2025 12:24:14 AM

బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ 

సదాశివనగర్, జూన్ 12(విజయాక్రాంతి):ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో పాల్గొన్నారు. ముందుగా సరస్వతి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.

ప్రభుత్వం అందజేసిన దుస్తులను పుస్తకాలను పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని, సౌకర్యాలు కల గదులు ఉన్నాయని, చాలా గ్రామాలలో దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు రంగులు వేయించిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డిని అలాగే ఫర్నిచర్ అందజేసిన గాయత్రి షుగర్ యజమాన్యాన్ని అభినందించి శాలువాతో సన్మానించారు. 

డీఈఓ రాజు ఎంఈఓ యూసెఫ్, సొసైటీ చైర్మన్ మరి సదాశివరెడ్డి,వీడిసి చైర్మన్ ముధం సత్యం,బిజెపి రాష్ట్ర నాయకుడు సంకర విఠల్,మండల ప్రధాన కార్యదర్శి చక్రధర్ గౌడ్, తాసిల్దార్ సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్,తాజా మాజీ సర్పంచ్ పైడి జానకి జనార్ధన్, మాజీ ఎంపిటిసి ఎడ్ల రేణుక నర్సింలు, అంగన్వాడి సిడిపివో శ్రీలత, సూపర్వైజర్ పద్మ, ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి, సిసి అబ్బ లింగం, సి ఎ లు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.