06-06-2025 10:07:39 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి మహిళ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామనీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి అనూష శుక్రవారం తెలిపారు. బీఎస్సీ విభాగంలో ఎంపీసీ, ఎంఎస్డీ ఎస్పీజెడ్సీ, ఏంజెడ్సీ, బీకాం జనరల్, బీకాం సీఏ, బిఏ హెచ్ ఈ పి కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. 2025 ఇంటర్మీడియట్ పాస్ అయిన అర్హులైన మహిళ విద్యార్థులు పది, ఇంటర్ మెమొలు, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, 5 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా నేరుగా కళాశాలలో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 79950 10674లో సంప్రదించవచ్చునన్నారు.