06-06-2025 10:12:09 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): అప్పులు ఏలా తీర్చాలో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన బాణావత్ రవి 4 ఏళ్ల క్రితం అప్పు చేసి దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే చేసిన అప్పులు పెరగడంతో వాటిని ఏలా తీర్చాలో మదనపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.