04-06-2025 05:37:29 PM
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి...
హుజురాబాద్ (విజయక్రాంతి): రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి(District Collector Pamela Satpathy) అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని కలుగులగిద్దే గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం నిర్వహించిన భూభారతి, నూతన రెవెన్యూ చట్టం, గ్రామ రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించదుందని అన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను సధ్యం చేసుకోవాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు అక్కగా రికార్డు నమోదు చేయాలని సూచించారు.
తహసిల్దార్ సాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని తాసిల్దార్ కనకయ్యను ఆదేశించారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్న ప్రజలు ఈ రెవెన్యూ సదాకు హాజరై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. గ్రామంలో ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు రాగా వారిని నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు స్వీకరించ దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబు, తాసిల్దార్ కనకయ్య, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు.