11-06-2025 06:32:23 PM
తాడ్వాయి (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తాడ్వాయి తహశీల్దార్ శ్వేత(Tehsildar Shweta) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతులు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. భూమి రికార్డుల్లో నమోదు కాకున్నా, కొత్త పాస్ పుస్తకాలు రాకున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు చెన్నారెడ్డి, రాధాకృష్ణ, సంజీవ్, బలరాం, సుమలత తదితరులు పాల్గొన్నారు.