calender_icon.png 13 June, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా

11-06-2025 06:27:27 PM

పార్టీ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తా..

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్ట వంతానికి కృషి చేస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి(TPCC State General Secretary Gaddam Chandrasekhar Reddy) అన్నారు. బుధవారం కామారెడ్డిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపే దానికి, టిపిసిసి, ఏఐసీసీ, ఇచ్చే కార్యక్రమాలను పూజా తప్పకుండా అమలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన వంతు హాటీ పటిష్టమంతానికి కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి కోసం ఆ హార్నిశలు కృషి చేస్తాను అని తెలిపారు. నాపై నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది నాకు పదవి అని కాకుండా పార్టీ నాపై పెట్టిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేస్తానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ కులగలను చేసి తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు కృషి చేస్తానన్నారు.

కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మా అమ్మాయి షబ్బీర్ అలీ, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ  సమావేశంలో ఉరుదొండ రమేష్, మాజీ కౌన్సిలర్ అన్వర్ అహ్మద్, సలీం, కృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ, పంపరి శ్రీనివాస్, అజీజ్, తదితరులు పాల్గొన్నారు.