11-06-2025 06:36:32 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జుక్కల్ నియోజకవర్గం(Jukkal Constituency) బిచ్కుంద మండలం మాన్యాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడ్డీ వ్యాపారంలో భాగంగా 2 లక్షలు ఇవ్వగా, తిరిగి రెండు లక్షల 31,000 ఇచ్చేశానని, మరో రెండు లక్షలు ఇవ్వాలని వేధించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లు ఆయన తెలిపారు.