01-12-2024 10:51:57 AM
ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ లో శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం ను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం నుంచి ఆదివారం ప్రారంభమైన ఆరట్టు ఉత్సవం పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు చేపట్టిన ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. శోభాయాత్ర లో అయ్యప్ప దీక్షదారులు, భక్తుల భజన కీర్తనలు, అయ్యప్ప స్వామి నామస్మరణతో పట్టణ పురవీధుల మారుమ్రోగాయి. కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు శోభాయాత్ర లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా మహిళలు భక్తులకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.