03-06-2025 12:33:12 AM
హన్వాడ, జూన్ 2: ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు లేని వారికి ప్రాధన్యత ఇస్తామని చెప్పి వారిని పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని బిజెపి నాయకులు రఘురాం గౌడ్ అన్నారు. హన్వాడ మండలం పెద్దదర్ పల్లి గ్రామంలో చెంచులు, ఎరుకలి కులానికి సంబంధించిన వ్యక్తులు ఇండ్లు లేకపోయినప్పటికీ వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని, వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నిజమైన లబ్ధిదారులకు ముందుగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతున్న ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇలా ఇష్టంనుసారంగా వ్యవహరించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నేటికీ వీరు అడవికి వెళ్లి ఎండిపోయిన కట్టెలను తీసుకువచ్చి దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లో దిన స్థితిలో ఉన్న వారి వివరాలను తెలుసుకొని వారికి సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక నాయకులు సైతం నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ నాయకులు ఉన్నారు.