03-06-2025 12:35:02 AM
చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి అభినందనలు
కోదాడ జూన్ 2 ; జాతీయస్థాయి ఐఐటి కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కొరకై మే నెలలో నిర్వహించిన జేఈఈ అడ్వానస్డ్ ఎంట్రన్స్ ఫలితాలను సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు.
కేటగిరి వారిగా ఇస్లావత్ ఉత్తేజ్ 988వ ర్యాంక్, పి .వంశీ 3110 వ ర్యాంక్, పి.సూర్యప్రకాష్ 3277, సయ్యద్ హుజైఫా 4477 ర్యాంకుల సాధించి ప్రతిభ కనబరిచారు. చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ విద్యను రేస్ కళాశాల అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు