03-06-2025 12:31:47 AM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూన్ 2 (విజయ క్రాంతి) ప్రజల రక్షణ,శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి ప్రశంసనీయమైనదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది నిష్ఠతో క్రమశిక్షణతో సేవలందించాలని తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రతి ఒక్కరికి గర్వకారణం అన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుకుంటూ ప్రతి పోలీస్ అధికారి క్రమ శిక్షణ తో సేవలు అందిస్తూ జిల్లా పోలీస్ శాఖ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్ డిఎస్పీ యాకుబ్ రెడ్డి, సి.ఐ లు, ఆర్ఐలు, ఎస్.ఐ లు, ఎస్త్స్రలు, డిపిఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.